వర్షం ఫిరోజ్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన సందర్భంగా వైసీపీ యువజన నాయకులు వర్షం ఫిరోజ్ ఆధ్వర్యంలో విజయత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే సోమవారంనాడు స్థానిక తూర్పుపాలెం నందు ఏర్పాటు చేసిన విజయోత్సవ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసులరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి కేకును కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం ఇరువురిని వైసీపీ యువజన నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.