ఇంటినివేశన స్థలాల మంజూరుకై సర్వే నిర్వహించిన తహశీల్దార్

మండలంలోని మల్లవరం, అక్కచెరువు, సూదనగుంట, తుమ్మగుంట, మూగచింతల, రామాయణకండ్రిక, కొండాయపాలెం,ఓబులక్కపల్లి, సలకనూతల, మాదాలవారి పాలెం, నందిపాలెం గ్రామాలలో అర్హులకు ఇంటినివేశన స్థలాల మంజూరుకై పొదిలి మండల రెవిన్యూ తహశీల్దార్ జె ప్రభాకరరావు రెవిన్యూ సిబ్బందితో కలిసి భూములను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్లు యస్ శివరాం, యస్ సుబ్బారాయుడు, గ్రామ రెవిన్యూ అధికారులు సుబ్బారెడ్డి, దుర్గా ప్రసాద్, సుబ్బారావు, వెలుగొండయ్య, మండల సర్వేయరు దండు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.