గ్రామ రెవెన్యూ సహాయకులు దార్ల కన్నుమూత

పొదిలి నగర పంచాయితీ 15 వార్డు మాదాలవారిపాలెం గ్రామ రెవెన్యూ సహాయకులు దార్ల బాలరంగయ్య మృతి చెందిన సంఘటన
బుధవారం నాడు చోటుచేసుకుంది.దార్ల బాలరంగయ్య ప్రస్తుతం జిల్లా గ్రామ సహాయకుల సంఘం అధ్యక్షులు పని చేస్తున్నారు.దార్ల బాలరంగయ్య మృతదేహానికి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, ఆర్ఐ శివరాం, గ్రామ రెవెన్యూ అధికారులు సుబ్బారావు, మురళి, సురేష్, జూనియర్ అసిస్టెంట్ వసంత్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

మట్టిఖర్చులకు కాను 15వేలు రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేశారు.

దార్ల బాలరంగయ్య మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు