భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్ష

భార్యను హత్య కేసులో భర్తకు యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ శుక్రవారంనాడు 6వ ప్రత్యేక జిల్లా న్యాయస్థానం మార్కాపురం కోర్టు తీర్పును వెలువరించింది.

వివరాల్లోకి వెళితే పొదిలి మండలం గోగినేని వారి పాలెం గ్రామానికి చెందిన దాసరి తిరుపతమ్మ(32) ఉదయం 5:30 గంటల ప్రాంతంలో గ్రామ పొలాల్లోకి బహిర్బుమికి వెళ్తుండగా అక్రమసంబంధం అనుమానంతో 2016వ సంవత్సరం మార్చి 16వ తేదీన తిరుపతమ్మ భర్త అయిన దాసరి వెంకటేశ్వర్లు ఆమె వెనుకనుండి కత్తితో దాడి చేసి పీకకోసి హతమార్చిన కేసులో పొదిలి పోలీస్ స్టేషన్లో కేసు నెంబర్ 31/2016 నమోదు అయింది.

విచారణ చేపట్టిన 6వ జిల్లా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి రామకృష్ణ నిందితుడు దాసరి వెంకటేశ్వర్లుకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష మరియు 500రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరచినట్లు పొదిలి యస్ఐ శ్రీరామ్ పొదిలి పోలీసు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.