కరువు పనులు కోసం రోడ్డెక్కిన మహిళలు

మున్సిపాలిటీ పై కోర్టులో వ్యాజం తేలేంతవరకు ఉఫాది కల్పించాలని డిమాండ్

ప్రకాశంజిల్లా పొదిలి మున్సిపల్ పరిధిలోని కాటూరివారిపాలెం నందు ఉపాధి హామి పనులకోసం దాదాపు 20 నిమిషాలు మహిళాలు రాస్తారోకో నిర్వహించారు…

పొదిలి మున్సిపాలిటీ విషయమై కోర్టులో తేలేంతవరకు మాకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేసారు.

ఒంగొలు కర్నూలు జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో యస్ఐ శ్రీహరి తన సిబ్బందితో రంగప్రవేశం చేసి మహిళలతో చర్చించి ఉపాధిహమీ ఫీల్డ్ మేనేజర్ తో వివరణ ఇప్పించి ట్రాఫిక్ కు క్రమబద్ధీకరించారు.