యాదవ కార్తీక వనమహోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్న జంగా, నూకసాని, నెమలి రాజు

అఖిల భారత యాదవ మహసభ ఆధ్వర్యంలో నవబంర్ 25వ తేది సోమవారంనాడు పొదిలిలోని స్థానిక దరిశి రోడ్డులోని శ్రీకృష్ణ గోశాల నందు జరిగే యాదవ కార్తీక వనమహోత్సవ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, ప్రకాశం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ, మాజీ శాసనసభ్యులు ముద్రబోయిన వెంకటేశ్వర యాదవ్, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎంఎం కొండయ్య, జబర్దస్త్ స్టార్ నెమలి రాజు యాదవ్, మరియు అఖిల భారత యాదవ మహసభ  రాష్ట్ర మరియు జిల్లా నాయకులు హాజరు కానున్నారని కావున యాదవులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పొల్లా నరసింహంరావు, మూరబోయిన బాబూరావు యాదవ్, మువ్వ కాటంరాజు, కనకం వెంకట్రావు యాదవ్, పెమ్మని రాజు, బోగాని సుబ్బారావు, సన్నెబోయిన రాంబాబు, పొల్లా నరసింహ తదితరులు ఒక ప్రకటన తెలిపారు.