యాదవ వనమహోత్సవం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు యాదవ మహాసభ నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, కనకం వెంకట్రావు, పెమ్మని రాజు, మువ్వా కాటంరాజు, సన్నెబోయిన రాంబాబు, చాగంటి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.

స్థానిక యాదవ మహాసభ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీకి అదేవిధంగా శాసనమండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, బుల్లితెర నటుడు నెమలి రాజులకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమాన్ని ప్రచార మధ్యమాల ద్వారా ప్రచురించిన మరియు ప్రసారం చేసిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.