లోకేష్ ను కలిసిన బాబురావు

తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి శాసనమండలి సభ్యులు నారా లోకేష్ ను కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ తన అనుచరులతో గురువారం నాడు మంగళగిరి తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నందు కలిసారు.

ఈ సందర్భంగా మండలంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకొని పార్టీ పటిష్టతకు కృషి చేయ్యాలని ఎలాంటి ఇబ్బందులు ఉన్న తనను సంప్రదించాలని పార్టీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అన్నారని‌ మూరబోయిన బాబురావు యాదవ్ తెలిపారు.

నారా లోకేష్ ను కలిసిన వారిలో చిన్నారికట్ల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, చిట్టిబోయిన విజయ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు