మాజీ ఎంఎల్ఏ పిచ్చి రెడ్డికి ఘన నివాళి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

దరిశి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు స్వర్గీయ సానికొమ్ము పిచ్చిరెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా‌ ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉడుముల శ్రీనివాసులురెడ్డి ,జంకె వెంకట రెడ్డి, మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట్ రెడ్డి, కంభం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు,దరిశి మున్సిపల్ ఛైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యలు మాజీ సర్పంచ్ పులగోర్ల శ్రీనివాస్ యాదవ్ లు పిచ్చి రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

స్థానిక దరిశి రోడ్ లోని మంజునాథ కళ్యాణ మంటపం నందు సోమవారం నాడు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ సానికొమ్ము పిచ్చిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం సానికొమ్ము, శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు , వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు సానికొమ్ము పిచ్చిరెడ్డి అభిమానులు,పట్టణ ప్రముఖులు పిచ్చి రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.