తొలి కోవిడ్ నిర్ధారణ కేసు నమోదు రెడ్ జోన్ పరిధిలోకి పొదిలి పట్టణం

కటైన్మైంట్ పరిధి రూపకల్పనలో అధికారులు

పొదిలి మండల పరిధిలోని పొదిలి గ్రామ పంచాయతీ ఎన్జీఓ కాలనీకి చెందిన 25సంవత్సరాల యువకుడికి కోవిడ్ నిర్ధారణ కావడంతో పొదిలి పట్టణంలో తొలి కోవిడ్ నిర్ధారణ కేసు కాగా మండలంలో రెండవ కేసుగా నమోదయింది.

కోవిడ్ నిర్ధారణ కావడంతో పొదిలి పట్టణం రెడ్ జోన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు వర్గాలు తెలుపగా…. కంటోన్మెంట్ జోన్ పరిధిని నిర్ణయించేందుకు అధికారులు రూపకల్పన చేసే పనిలో నిమగ్నమయ్యారు.

శుక్రవారం రాత్రి 1గంట సమయంలో కోవిడ్ నిర్ధారణ అయిన ఎన్జీఓ కాలనీ యువకుడి ఇంటి వద్ద నుండి ప్రత్యేక 108 వాహనాలలో ఒంగోలు కోవిడ్ వైద్యశాలకు తరలించారు.

అతని కుటుంబ సభ్యులను క్వారెంటైన్ కు తరలించారు.