నిర్మమహేశ్వర స్వామి భూములు కౌలు వేలం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

నిర్మమహేశ్వర స్వామి దేవాలయం చెందిన భూములు కౌలు వేలం పాట స్థానిక శివాలయం నందు బుధవారం నాడు దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాసులు అధ్యక్షతన తో జరిగింది

పొదిలి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 457/1,2 లోని 45.13 ఎకరాల భూమికి రెండు సంవత్సరాలకు కౌలు వేలం పాటలు ద్వారా 2లక్షల97వేలు రూపాయలు ఆదాయం వచ్చిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి బి శ్రీనివాసులు తెలిపారు.

ఈ కౌలు వేలం పాట లో రికార్డు అసిస్టెంట్ కాటూరి ప్రసాద్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు