రాజన్న బాడిబాటలో భాగంగా సైకిళ్లు పంపిణీ

రాజన్న బడిబాటలో భాగంగా సైకిళ్లను పంపిణీ చేశారు.

వివరాల్లోకి వెళితే 73వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, మండల పరిషత్ ప్రత్యేక అధికారి బెనహరన్, పంచాయతీ రాజ్ విస్తరణ అధికారి రాజశేఖర్ చేతుల రాజన్న బడిబాటలో భాగంగా తల్లిదండ్రులు లేని అలాగే తల్లి కానీ తండ్రి కానీ లేని విద్యార్థులకు పంపిణీ నిమిత్తం 30సైకిళ్లు రాగా స్వాతంత్ర్య దినోత్సవంనాడు 15సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.