రెండు అక్రమ ఇసుక ట్రాక్టర్లు పట్టివేత ఇద్దరి అరెస్టు

యస్ఇబి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక మర్రిపూడి మండలం గార్లపేట గ్రామం నందు అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లును సదరు ట్రాక్టర్ డ్రైవర్లను మరియు 8 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకొని మర్రిపుడి పోలీసు స్టేషన్ అప్పగించినట్లు పొదిలి యస్ఇబి స్టేషన్
యస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ఈ దాడుల్లో  హెడ్ కానిస్టేబుల్  వెంకటరావు,  కానిస్టేబుల్ షేక్ బాజీ సయ్యద్, యస్ యన్ గురవయ్య, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు